News and Entertainment

సీతారాములు, లక్ష్మణుడు ఏ విధంగా చనిపోయారో మీకు తెలుసా-1


సీతాదేవి తనువ చాలించిన తర్వాత రాముడు అయోధ్య రాజ్యాన్ని పాలిస్తూ తన కుమారులైన లవ, కుశులకు యుద్ధ విద్యలు నేర్పుతుంటాడు. అలా ఒక రోజు యమధర్మరాజు ఒక ముని వేశంలో వచ్చి రాముడిని కలసి “రామా! మనం మాటాడే విషయాలు వేరెవ్వరికి తెలియకూడదు, ఒక వేళ అలా మధ్యలో ఎవరైనా ప్రవేశించినా, విన్నా మరణదండన విధిస్తానంటే నీతో ముచ్చటిస్తాను” అని అంటాడు., యమధర్మరాజు మాటకి సరే అని తన భవనంలో చివరిగా ఉండే గదిలోకివెళ్తారు ఇద్దరు. ఆ గదికి లక్ష్మణుడు కాపలాగా ఉంటాడు.