టాలీవుడ్ను కొన్ని రోజుల క్రితం షేక్ చేసిన డ్రగ్స్ విషయమై రానా మరియు ఆయన తమ్ముడి పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. డ్రగ్స్ కేసును విచారిస్తున్న అధికారులను రానా తండ్రి సురేష్బాబు మ్యానేజ్ చేడయం వల్ల వీరి పేర్లు బయటకు రాలేదు అనే టాక్ కూడా వచ్చింది.
ఇటీవల కూడా రామానాయుడు స్టూడియోకు సిట్ అధికారులు వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. ఆ విషయమై తాజాగా టీవీ9 యాంకర్ రానాను ప్రశ్నించింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ప్రమోషన్లో భాగంగా టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన రానా డ్రగ్స్ ప్రశ్న రాగానే చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.
యాంకర్పై తీట్ల వర్షం కురిపించాడు. ఇంటర్వ్యూ ప్రారంభంకు ముందే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయవద్దని చెప్పాను.
మళ్లీ ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తావేంటి అంటూ యాంకర్ను రానా తిట్లేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డ్రగ్స్ కేసుతో సంబంధం లేనప్పుడు ఎందుకు రానాకు ఇంత కోపం వచ్చిందో అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వారంలో రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ALSO READ: